Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోవాటెల్ వేదికగా అమిత్‌తో భేటీ అయిన ఎన్టీఆర్

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (07:55 IST)
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం అమిత్ షాతో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. అమిత్‌షాకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువా కప్పి ఎన్టీఆర్ సన్మానించారు. 
 
ఈ సందర్భంగా వారి మధ్య "ఆర్‌ఆర్‌ఆర్‌" సినిమా, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నా.. అమిత్‌షా - జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు సమాచారం. 
 
అనంతరం అమిత్‌షా ఈ భేటీపై ట్వీట్‌ చేశారు. 'అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. తెలుగు సినిమా తారకరత్నం అయిన  జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, రాత్రి 11.16 వరకు ఎన్టీఆర్‌ నోవాటెల్‌ హోటల్‌లోనే ఉన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. 
 
తెలంగాణలో అధికారమే ధ్యేయంగా అడుగులు వేస్తోన్న బీజేపీ.. పలు రంగాల ప్రముఖులతో మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌షా భేటీ అయినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments