Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు: 8మంది అరెస్ట్

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (19:21 IST)
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత కక్షలతో పక్కా ప్లాన్‌ ప్రకారమే నిందితులు కృష్ణయ్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజైన ఆగష్టు 15వ తేదీన కృష్ణయ్యను దారుణంగా చంపి పారిపోయినట్లు తెలిపారు. 
 
ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసి ఖమ్మం సెషన్స్ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు.  
 
ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి మూడు బైకులు, ఆటో, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments