Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ మాట్లాడుతూ 27 అంతస్తుల భవనంపై నుంచి కిందపడ్డ హైదరాబాద్ యువకుడు

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (09:58 IST)
కెనడాలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న హైదరాబాదు యువకుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. వనస్థలిపురం ఫేజ్ 4కు చెందిన పాణ్యం అఖిల్ (19) టోరంటోలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్నాడు. మొదటి సెమిస్టర్ పూర్తి కావడంతో ఈ ఏడాది మార్చి 20న హైదరాబాదు వచ్చాడు.
 
తిరిగి ఈ నెల 5న కెనడా వెళ్లాడు. ఈ నెల 8న తెల్లవారు జామున తను నివాసం ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనిలో ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి ప్రాణాలు కోల్పో యాడు. సమాచారం అందుకున్న స్నేహితులు వెంటనే అఖిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
కుమారుడి మృతదేహాన్ని హైదరాబాదుకు తెప్పించడానికి సాయం చేయాలని కోరుతూ అఖిల్ తల్లిదండ్రులు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ అఖిల్ మృతదేహాన్ని తీసుకురావడంలో సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అక్కడ రాయబార కార్యాలయ అధికారులతో కేటీఆర్ మాట్లాడారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments