Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంలో నీళ్లకు బదులు యాసిడ్ కలుపుకుని తాగిన యువకుడు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:52 IST)
ఓ యువకుడు మంచినీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని త్రాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్‌రావు అందించిన సమాచారం ప్రకారం, కుమ్మరివాడికి చెందిన గణపతిస్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడైన విజయ్‌కుమార్(26) ఆటోని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఆదివారం సాయంత్రం మద్యం సీసాతో ఇంటికి వచ్చిన విజయ్ మిద్దె పైకి వెళ్లాడు, అక్కడ బాత్‌రూమ్ కిటికీపై ఉన్న యాసిడ్ బాటిల్‌ని నీళ్ల సీసాగా భావించి మద్యంలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటికి గొంతులో మంట పుట్టడంతో యాసిడ్‌గా గుర్తించాడు, గట్టిగా కేకలు పెట్టాడు.
 
ఇంట్లో ఉన్న తండ్రి అప్రమత్తమై హుటాహుటిన స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments