Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణిని బంధించి రెండు రోజులు అత్యాచారం, ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (16:31 IST)
అసలే నిండు గర్భిణి. ఆసుపత్రి చెకింగ్‌కు వెళ్ళాలనుకుంది. బంధువులు అందుబాటులో లేకపోవడంతో పక్కింటి వ్యక్తి సాయం తీసుకుంది. కానీ ఆ వ్యక్తే చివరకు తన జీవితాన్ని నాశనం చేస్తాడని ఊహించలేదు. రెండురోజుల పాటు గదిలో నిర్భంధించి అత్యాచారం చేయడమే కాకుండా అతిదారుణంగా హింసించాడు ఓ యువకుడు.
 
తెలంగాణా రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ఒక మహిళకు కొంతకాలం క్రితమే వివాహమైంది. ఇప్పటికే ఇద్దరు సంతానం. ఆరు నెలల క్రితం గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చింది. ప్రతి నెల ఆసుపత్రికి వెళ్ళి చెకప్ చేసుకుంటూ ఉండేది. 
 
అయితే నిన్న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్ళి ఆటోలో వెళదామనుకుంది. అయితే మధ్యలో ఇంటి పక్కనే ఉన్న మల్లయ్య అనే యువకుడు కనిపించాడు. తన మోటారు సైకిల్ పైన ఆసుపత్రిలో దింపుతానని నమ్మించాడు. దీంతో నమ్మిన ఆమె స్కూటర్ ఎక్కింది. 
 
ఒక గదికి తీసుకెళ్ళి ఆ యువకుడు రెండురోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగోలా తప్పించుకుని ఆలేరు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోగా పెద్దల పంచాయతీకి పంపించారు. దీనిపై మహిళ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments