మరో ఘోరం... పరువు హత్యాయత్నం... ప్రేమికులపై కత్తితో దాడి...

సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య తర్వాత అలాంటి ఘోరమే ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నడి రోడ్డు మీద ఓ ప్రేమజంటపై అమ్మాయి మేనమామ ఇద్దరిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ద

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:15 IST)
సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య తర్వాత అలాంటి ఘోరమే ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డ నడి రోడ్డు మీద ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి ఇద్దరిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడికి కారణం ప్రేమ వ్యవహారమేనని అనుమానిస్తున్నారు.
 
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఘటన మరువక ముందే.. తెలంగాణ రాజధానిలో హైదరాబాదులో మరో దారుణ హత్యాయత్నం వెలుగుచూసింది. తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో సందీప్(24) మాధవి(22)‌ జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
ఈ దాడిలో సందీప్, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments