నీ పెళ్లి కుదిరింది, నా డెత్ టైమ్ ఫిక్స్ చేశానంటూ ప్రియురాలికి సెల్ఫీ వీడియోలో...

Webdunia
సోమవారం, 31 మే 2021 (13:01 IST)
ప్రియురాలికి మరొకరితో వివాహం ఫిక్స్ అయిందని తెలిసిన ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. ప్రియురాలికి సెల్ఫీ వీడియో తీసి పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లా గుర్రంపోడుకి చెందిన మైదాసు రమేశ్, యాకాశమ్మ దంపతుల కుమారుడు రాకేశ్‌. ఇతడు అదే ప్రాంతానికి చెందిన యువతిని కొంతకాలంగా ఇష్టపడుతున్నాడు. ఐతే ఆ యువతి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ నిన్ను తప్ప మరొకర్ని నా జీవితంలో ఊహించుకోలేను అంటూ చెపుతుండేవాడు.
 
ఈ క్రమంలో అతడు ప్రేమించిన యువతికి మరొకరితో జూన్‌ 2న వివాహం నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. ఇది తెలుసుకున్న రాకేష్ తీవ్ర మనస్థాపానికి లోనై, నువ్వే నా ప్రాణమని చెప్పా, అలాంటిది నువ్వు వేరేవాడిని పెళ్లాడితే ఇక నేను బతికెందుకు, చివరిసారిగా నన్ను చూడు అంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఈ వీడియో స్నేహితుల వాట్సప్ లో పెట్టడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అతడు ఆదివారం నాడు మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments