Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిని చంపేసిన సపోటా గింజ... ఎలా?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:22 IST)
ఆమధ్య తమిళనాడులో సమోసా గొంతులో ఇరుక్కుని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని మల్లాపూరులో చోటుచేసుకుంది. సపోటా పండు తింటున్న బాలుడు నోట్లో సపోటా గింజ ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే... మల్లాపురుకి చెందిన లింగా గౌడ్, సుజాతలకు ఇద్దరు కుమారులు. గౌడ్ సౌదీలో పనిచేస్తుండగా అతడి భార్య సుజాత బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ ఇక్కడే వుంటోంది. సోమవారం నాడు తన విధులు ముగించుకుని వస్తూవస్తూ దారిలో తాజా సపోటా పండ్లు కనబడటంతో వాటిని కొనుగోలు చేసి తీసుకు వచ్చింది. 
 
సపోటా పండ్లతో ఆమ్మ కనబడగానే ఆమె వద్ద నుంచి ఓ సపోటా పండు తీసుకుని నాలుగేళ్ల పిల్లాడు తినేశాడు. ఐతే తింటున్న సమయంలో సపోటా పండు గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి పరిస్థితిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అతడు మృత్యువాత పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments