Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ భక్తిని చాటిన కరీంనగర్ జిల్లా రైతు.. పొలంలోనే స్వతంత్ర్య వేడుకలు

Webdunia
ఆదివారం, 15 ఆగస్టు 2021 (15:24 IST)

తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు తన పొలంలోనే స్వాతంత్ర్య  75వ వేడుకలను జరుపుకున్నారు. ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఆయన తనపొలంలోనే భారతదేశ చిత్రపటాన్ని వరి పైరుతోనే సృష్టించారు. దానికి ఎదురుగా గట్టుపై జాతీయ జెండాతో ఈ వేడుకలను నిర్వహించారు. 

కాగా, ఈ రైతు పేరు జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి. ఈ మేరకు తన పొలంలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరి పైరు సహాయంతో దేశ పటాన్ని చిత్రీకరించాడు. 20 గుంటల విస్తీర్ణంలో దేశ చిత్రపటం వచ్చే విధంగా వరి నాటాడు. నేటి నుంచి ఏడాది పొడవునా.. జాతీయ గీతం పాడటంతో పాటు ఉదయం పూట జెండాను ఆవిష్కరించి సాయంత్రం వితరణ చేయనున్నట్లు రైతు తెలిపాడు.
 
మల్లికార్జున్ రెడ్డి ఇప్పటికే వ్యవసాయంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అద్భుత ఫలితాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. అదే స్ఫూర్తితో మరోసారి అందరిలో ఒక్కడిగా నిలవాలని ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు తన దేశభక్తిని చాటాడు. ఆయన తన పొలంలో చిత్రీకరించిన వరి పటం తాజాగా అందరిని ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments