Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (22:39 IST)
తెలంగాణలో తొమ్మిదో తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఎం. రాజేష్ (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులకు హాజరవుతుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.
 
స్కూల్ టీచర్లు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. 
 
హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ 46 ఏళ్ల వ్యక్తి మరణించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. రామాంతపూర్ ప్రాంతంలోని ఓ ప్లేగ్రౌండ్‌లో కొంతమంది స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతూ కె.కృష్ణారెడ్డి కుప్పకూలిపోయాడు.
 
గత వారం, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో 16 ఏళ్ల విద్యార్థిని తన కళాశాల వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments