Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో బాలిక మిస్సింగ్.. చెరువులో శవమై తేలింది...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (12:23 IST)
హైదరాబాద్ నగరంలో అదశ్యమైన ఓ బాలిక కథ విషాదంగా ముగిసింది. ఆ బాలిక చెరువులో శవమై తేలింది. గురువారం కనిపించకుండా పోయిన ఈ చిన్నారి శుక్రవారం చెరువులో శవంగా కనిపించింది. దమ్మాయిగూడకు చెరువులో ఆ బాలిక మృతేదహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే, మృతదేహాన్ని తల్లిదండ్రులతో పాటు స్థానికులకు చూపించకుండా పోలీసుల ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థిని గురువారం ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. తమ బిడ్డ గురువారం ఎప్పటిలాగానే స్కూలుకు వెళ్లిందని తల్లిదండ్రులు చెప్పారు. కానీ, మధ్యాహ్నానికి పాప కనిపించడంలేదంటూ స్కూల్ నుంచి ఫోన్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పైగా, ఆ పాపకు చెందిన స్కూల్ బ్యాగు, పుస్తకాలు తరగతి గదిలోనే ఉన్నాయని, కానీ, పుస్తకాలు లేవని టీచర్ సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పుటేజీలను సేవకరించి తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఆ బాలిక దమ్మాయిగూడ చెరువులో శవమై కనిపించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments