హైదరాబాద్ నగరంలో బాలిక మిస్సింగ్.. చెరువులో శవమై తేలింది...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (12:23 IST)
హైదరాబాద్ నగరంలో అదశ్యమైన ఓ బాలిక కథ విషాదంగా ముగిసింది. ఆ బాలిక చెరువులో శవమై తేలింది. గురువారం కనిపించకుండా పోయిన ఈ చిన్నారి శుక్రవారం చెరువులో శవంగా కనిపించింది. దమ్మాయిగూడకు చెరువులో ఆ బాలిక మృతేదహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే, మృతదేహాన్ని తల్లిదండ్రులతో పాటు స్థానికులకు చూపించకుండా పోలీసుల ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థిని గురువారం ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. తమ బిడ్డ గురువారం ఎప్పటిలాగానే స్కూలుకు వెళ్లిందని తల్లిదండ్రులు చెప్పారు. కానీ, మధ్యాహ్నానికి పాప కనిపించడంలేదంటూ స్కూల్ నుంచి ఫోన్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. పైగా, ఆ పాపకు చెందిన స్కూల్ బ్యాగు, పుస్తకాలు తరగతి గదిలోనే ఉన్నాయని, కానీ, పుస్తకాలు లేవని టీచర్ సమాచారం చేరవేసింది. 
 
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పుటేజీలను సేవకరించి తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఆ బాలిక దమ్మాయిగూడ చెరువులో శవమై కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments