Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో దసరా పండుగ - ఒకే రోజు ఏడుగురు జడ్జీలు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (17:46 IST)
తెలంగాణ హైకోర్టులో దసరా పండుగ వాతావరణం నెలకొంది. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం నియమించిన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేశారు. 
 
హైకోర్టు ఫస్ట్‌ కోర్టు హాలు వేదికగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కొత్త న్యాయ‌మూర్తుల చేత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీశ్ చంద్ర‌శ‌ర్మ ప్ర‌మాణం చేయించారు. 
 
న్యాయ‌మూర్తులుగా ప్ర‌మాణం చేసిన వారిలో జ‌స్టిస్ పెరుగు శ్రీ సుధా, జ‌స్టిస్ డాక్ట‌ర్ చిల్ల‌కూరు సుమ‌ల‌త‌, జ‌స్టిస్ డాక్ట‌ర్ గురిజాల రాధారాణి, జ‌స్టిస్ మున్నూరి ల‌క్ష్మ‌ణ్‌, జ‌స్టిస్ ఎన్.తుకారాం జీ, జ‌స్టిస్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, జ‌స్టిస్ ప‌టోళ్ల మాధ‌వి దేవీ ఉన్నారు.
 
తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత తొలిసారి ఏడుగురు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్త న్యాయమూర్తులు ఈ నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు. 
 
విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో తేదీని శుక్రవారానికి మార్చారు. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments