Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో బూస్టర్ డోసులకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (13:51 IST)
చైనా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తుంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అదేసమయంలో ప్రజలు కూడా అలెర్ట్‌గా ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు, బూస్టర్ డోసులు వేయించుకోనివారు ఇపుడు ఆ టీకాలను వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. 
 
దీంతో తెలంగాణాలో బూస్టర్ డోసులతో పాటు కరోనా టీకాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. క్రిస్మస్ రోజున సైతం ఈ టీకాల కోసం ప్రజలు భారీగా సంఖ్యలో బారులు తీరారు. దీనికి కారణం కేంద్ర జారీ చేసిన ముందస్తు హెచ్చరికలే కావడం గమనార్హం. దీంతో ఎందుకైనా మంచిదని బూస్టర్ డోసు కోవిడ్ టీకాలను వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 
 
గడిచిన 72 గంటల్లో బూస్టర్ డోస్‌ వేయించుకునేందుకు వచ్చే వారి సంఖ్య అంతకుముందు రోజువారీ సగటుతో పోల్చితే ఏకంగా 400 శాతం పెరిగినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 21వ తేదీన 646 మంది బూస్టర్ డోసులు వేయించుకోగా, 22న 1631 మంది, 23న 2267 మంది 24న 3380, 25న 1500 మంది చొప్పున ఈ టీకాలు వేయించుకున్నారు. కేంద్రం హెచ్చరికలకు ముందు ఈ బూస్టర్ డోసులు వేయించుకునేవారి సంఖ్య ప్రతి రోజూ వందల్లో ఉంటే ఇపుడు ఈ సంఖ్య వేలల్లోకి చేరిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం