బీజేపీని గాలి జనార్థన్ రెడ్డి వీడటానికి కారణం ఇదేనా?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (13:14 IST)
కర్నాటక మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ వీడారు. పైగా కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పారు. ఇది కర్నాటకలోనే కాకుండా, దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కుని సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌పై బయట తిరుగుతున్న గాలి జనార్థన్ రెడ్డి ఇపుడు ఉన్నట్టుండి బీజేపీని వీడి "కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష" పేరుతో కొత్త పార్టీని స్థాపించడంలో ఆంతర్యం ఏంటన్నదానిపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. 
 
పైగా, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాలి జనార్థన్ రెడ్డి కూడా వచ్చే 2023లో కర్నాటక అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే ఆయన తన భార్యతో కలిసి ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
 
మరోవైపు, నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.6 కోట్లను విరాళంగా కూడా ఇచ్చారు. ఇది బీజేపీ నేతలకు ఏమాత్రం నచ్చలేదు. గాలి చర్యలపై బీజేపీ కర్నాటక నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. దీంతో ఆయన గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రటించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments