Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో అర్థరాత్రి ఘోరం.. గోడకూలి 9 మంది మృతి

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (09:05 IST)
హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా మంగళవారం రాత్రి ఘోరం జరిగింది. చాంద్రాయణగుట్ట మహ్మదీయ హిల్స్‌లో మంగళవారం అర్థరాత్రి ప్రహరీ గోడ కూలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. 
 
మహ్మదీయహిల్స్‌లో ఓ కాంపౌడ్‌ వాల్‌ కూలి ఐదు ఇండ్లపై పడింది. దీంతో ఒక ఇంట్లో ఉన్న ఐదుగురు, మరో ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
మరోవైపు, భారీ వర్షాలతో ముంపునకు గురైన కాలనీల ప్రజలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎలాంటి అధైర్యానికి గురికావద్దని చెప్పారు. మంగళవారం బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని స్నేహమయినగర్‌, గాంధీనగర్‌, అఖిలాండేశ్వరినగర్‌, పీవీఆర్‌ కాలనీల్లో కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్నతో కలిసి పర్యటించారు. మురుగు, వరద నీటిలో పాదయాత్ర చేశారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఊహించని విధంగా వస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పై కాలనీల నుంచి వచ్చిన వరదతో ముంపు తప్పడం లేదన్నారు. ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. బుధవారం కూడా వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం