తెలంగాణాలో విస్తారంగా వర్షాలు : గోనెపల్లి వాగులో ఇద్దరి గల్లంతు

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (17:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. సిద్దిపేట జిల్లా కురిసిన వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిన్నకోడూరు మండలం గోనెపల్లి వాగులో ఆదివారం ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. 
 
సదరు వ్యక్తులను మధ్యప్రదేశ్‌కు చెందిన తోమర్‌ సింగ్‌, మహారాష్ట్రలోని ముంబై వాసి సురేష్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వాగు వద్దకు చేరుకొని.. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీరాం సాగర్​, దిగువ మానేరు, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
 
​నిజామాబాద్​ జిల్లాలోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో 46,558 క్యూసెక్కులు ఉండగా.. 11గేట్ల ద్వారా 37,440 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 7,500 క్యూసెక్కులు దిగువకు విడదల అవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తానికి చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Vishnu: ప్రజాప్రతినిధులూ డ్రెగ్ టెస్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా : మంచు విష్ణు

కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'ధురంధర్ : ది రివెంజ్'

యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ 4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు

Satya: జెట్లీ ఫస్ట్ సింగిల్ సత్య ఈజ్ నాట్ జెట్లీ ఏప్రిల్ 2న రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

రవీనా టాండన్, రాషా థడానీలతో తల్లి-కూతుళ్ల నమ్మకాన్ని వేడుక చేసిన గార్నియర్ కలర్ నాచురల్స్

మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments