కీసరలో రేవ్ పార్టీ.. 16మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (15:02 IST)
మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. స్థానికంగా ఉండే ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి ఫామ్ హౌస్‌లో పలువురు వ్యక్తులు అమ్మాయిలతో చిందులేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌస్కు చేరుకుని పార్టీలో పాల్గొన్న బేస్ర్ క్రాప్ సీడ్స్ కంపెనీ మేనేజర్‌ను, పది మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు, సిద్దిపేట, వరంగల్, నల్గొండ, గజ్వేల్‌కు చెందిన సీడ్స్ డీలర్లను అరెస్టు చేశారు. 
 
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం రాత్రి ఫారెస్ట్ రీడ్జ్ రిసార్ట్స్‌లోని ఓ విల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న 16 మందిని అరెస్ట్ చేసినట్లు కీసర పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారి నుంచి మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments