Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ చైతన్య స్కూల్ మూడో అంతస్తు నుంచి దూకిన 15 ఏళ్ల విద్యార్థిని

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (11:00 IST)
10వ తరగతి చదువుతున్న కొలిపాక సాయి శరణ్య అనే 15 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం సాయంత్రం ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్‌లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లోని మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 
 
పాఠశాల సిబ్బంది ఆమెను పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు యాజమాన్యమే కారణమంటూ పీడీఎస్‌యూ కార్యకర్తలు పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిరసనకు దిగారు. అయితే, పాఠశాల యాజమాన్యం ఆరోపణలను కొట్టిపారేసింది.
 
బాలిక ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడిపోయిందని పేర్కొంది. ఆమె పాదరక్షలు మూడో అంతస్తు మెట్లపై కనిపించాయి. శరణ్య సాయంత్రం తన క్లాస్‌మేట్స్‌తో కలిసి మూడవ అంతస్తులోని వాష్‌రూమ్‌కు వెళ్లింది, అయితే ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో రక్తపు మడుగులో కనిపించింది. 
 
శరణ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించగా, స్కూల్ యాజమాన్యం ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించి మీడియా ప్రతినిధులను ప్రాంగణంలోకి రానీయకుండా అడ్డుకుంది. 
 
శరణ్యకు రెండు కాళ్లు, చేతులు ఫ్రాక్చర్ అయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments