Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - 15 మందికి గాయాలు

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (16:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది చిన్నారులు గాయాలయ్యాయి. 
 
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిచారు. ప్రమాదానికి గల కారణాలను జిల్లా డీఈవోను అడిగి తెలుసుకున్నారు. అలాగే, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోనులో మాట్లాడి విద్యార్థుల క్షేమ సమచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందేలా చూడాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments