Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ వ్యానును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - 15 మందికి గాయాలు

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (16:34 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సును ఆర్టీసీ బస్సు ఒకటి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది చిన్నారులు గాయాలయ్యాయి. 
 
ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందిచారు. ప్రమాదానికి గల కారణాలను జిల్లా డీఈవోను అడిగి తెలుసుకున్నారు. అలాగే, గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
మరోవైపు, ఈ ప్రమాదంపై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోనులో మాట్లాడి విద్యార్థుల క్షేమ సమచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందేలా చూడాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments