నిర్వహణా పనులు, భద్రత కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల పాటు 13 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ పలు మార్గాల్లో తిరిగే డెము రైళ్లు రద్దు కానున్నాయి.
ఈ రైళ్లతో పాటు ఫలక్ నుమా మనోహరాబాద్ సికింద్రాబాద్ డెము ప్యాసింజర్,సికింద్రాబాద్ ఉమ్దా నగర్ డెము ప్యాసింజర్ , ఉమ్దా నగర్ ఫలక్ నుమా ఉమ్దా నగర్ డెము ప్యాసింజర్, ఫలక్ నుమా భువనగరి ఫలక్ నుమా ప్యాసింజర్ రైళ్లు ఆరు నెలల పాటు నిలిచిపోనున్నాయి.
ఇదే సమయంలో కొన్ని రైళ్లను పాక్షికంగానూ రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి మార్చి 15 వరకూ బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ షాద్ నగర్ వరకు మాత్రమే నడుస్తుంది. మహబూబ్ నగర్ కాచిగూడ ప్యాసింజర్ రైలు కూడా షాద్ నగర్ వరకే నడుపనుంది. మేడ్చల్ కాచిగూడ ప్యాసింజర్ ను మేడ్చల్, బొల్లారం మధ్య రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.