Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు - సర్కారు జీవో జారీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (11:45 IST)
విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలను 31కు పెంచారు. ఇపుడు కొత్తగా మరో 13 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
స్థానిక ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. కొత్త మండలాల ఏర్పాటుపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.
 
కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలను పరిశీలిస్తే... నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె, వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సారూర, మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం కేంద్రాలుగా కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments