Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో దంచి కొడుతున్న భారీ వర్షాలు.. ఆ ఐదు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

Rains
, శనివారం, 23 జులై 2022 (09:54 IST)
తెలంగాణ మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గత 24 గంటల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కుమ్మేస్తున్నాయి. 
 
నైరుతి రుతుపవనాలతో పాటు ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. దీంతో ఆయా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. 
 
అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని.. ఐదురోజుల పాటు అత్యంత అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే హైదరాబాద్ నగర పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పశ్చిమ బెంగాల్‌లో భారీ స్కామ్.. కోట్లు చేతులు మారాయా.. డబ్బే డబ్బు!