Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (10:30 IST)
హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి సోమవారం కూడా కొనసాగాయి. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదను చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండటంపై విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుపట్ల విద్యార్థులు మండిపడ్డారు. 
 
క్యాంపస్‌లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్‌లోని చెట్లను తొలగించి, క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకుని జేసీబీల సాహంయో స్థలాన్ని శుభ్రం చేసుతుండంపై వారు మండిపడుతూ, ఆందోళనలకు దిగారు. 
 
ఎట్టిపరిస్థితుల్లోనూ క్యాంపస్ స్థలాన్ని కోల్పోయేది లేదని, విద్యార్థులంతా కలిసికట్టుగా పోరాటం చేసి తమ స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ  నిర్ణయాన్ని మార్చుకోవాలని లేనిపక్షంలో విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందంటూ విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. నిరసనలు తెలుపుతున్నవారిని పోలీసుల అరెస్టులు చేయడంపై వారు మండిపడుతున్నారు. విద్యార్థులకు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు పలికాయి. దీంతో క్యాంపస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments