Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ ఇస్తామంటూ చెప్పి చిన్నారిపై అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (12:32 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు లేకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి చిన్నారిపై మద్యం మత్తులో ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి, ఫసల్‌ వాదీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ కాలనీలో ఎనిమిదేళ్ల బాలిక ఆడుకుంటూ వుండగా.. చాక్లెట్ కొనిస్తామని ఇద్దరు యువకులు ఆ బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే కామాంధుల అకృత్యానికి అనంతరం తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. వెంటనే స్థానికులు ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. 
 
సీసీటీవీ కెమెరాల ఆధారంగా స్థానికులు కామాంధులను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నారని విచారణలో తేలింది. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments