కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇవ్వలేదు.. రూ.3లక్షల కోట్లే ఇచ్చింది..

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (12:16 IST)
తెలంగాణకు పదేళ్లలో కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం తప్పుబట్టారు. రాష్ట్రానికి రూ. 3,70,235 కోట్లు మాత్రమే వచ్చాయి. 
 
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. నగరంలో జరిగిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న విక్రమార్క.. పదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి వచ్చిన నిధులపై కేంద్రం గణాంక వివరాలను బయటపెట్టాలన్నారు. 
 
గత ఏడాది కాంగ్రెస్ పగ్గాలు చేపట్టకముందే రాష్ట్రాన్ని రూ. 7లక్షల కోట్ల అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసినందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. 
 
ఎన్నికలకు ముందు రైతు బంధు పథకానికి ఉద్దేశించిన రూ.7 వేల కోట్లను దారి మళ్లించి రాష్ట్ర ఖజానాకు జీరో బ్యాలెన్స్‌ లేకుండా చేశారని మాజీ సీఎం కే చంద్రశేఖర్‌ను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments