Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండెక్టర్

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (16:25 IST)
గద్వాల్-వనపర్తి మార్గంలో టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆ గర్భిణికి మహిళా కండక్టర్, నర్సు సహాయంతో పురుడు పోసింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
 
సోమవారం ఉదయం గద్వాలకు చెందిన సంధ్య అనే గర్భిణి పల్లె వెలుగు బస్సులో రక్షా బంధన్ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహళ్లికి చేరుకోగానే ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి.
 
మహిళా కండక్టర్ జి భారతి వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేసి బస్సును ఆపింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సుతో పాటు కండక్టర్ గర్భిణిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. ఈ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌ సహాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. సకాలంలో స్పందించిన మహిళా కండక్టర్‌ను యాజమాన్యం తరపున టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments