గ్రూప్‌-1 పరీక్షల రీషెడ్యూల్‌ కోసం నిరసన.. లాఠీ ఛార్జ్, ఉద్రిక్తత

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (22:29 IST)
Hyderabad
గ్రూప్‌-1 పరీక్షల రీషెడ్యూల్‌ కోసం నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు అభ్యర్థులకు గాయాలయ్యాయి. 
 
నిరసనకారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వ ఉత్తర్వు (GO) 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామన్నారు. 
 
నిరసనలను కట్టడి చేసేందుకు పలువురు అభ్యర్థులను అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇందిరాపార్క్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ వరకు పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు.
 
గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులు పలువురు కరీంనగర్‌లోని బండి సంజయ్‌ ఇంటికి వెళ్లి కలిశారు. మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయడంలో తమకు సాయం చేయాలని కేంద్రమంత్రిని కోరారు. 
 
ఈ సందర్భంగా గ్రూప్స్ అభ్యర్థుల నిరసనకు బండి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు జీవో 29 గొడ్డలి పెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల విషయంలో రేవంత్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments