Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిండిలో మూత్రం కలిపి చపాతీలు తయారీ... ఎక్కడ?

Advertiesment
chapati

ఠాగూర్

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (20:44 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ పారిశ్రామికవేత్త ఇంటిలో పని చేసే పనిమనిషి (వంట మనిషి) పిండిలో మూత్రం కలిపి చపాతీలు చేస్తోంది. ఈ తంతు గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ ఆ పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన 32 యేళ్ళ రీనా అనే ఓ మహిళ స్థానిక రెసిడెన్షియల్ సొసైటీలో నివసించే ఓ పారిశ్రామికవేత్త నితిన్ గుప్తా ఇంటిలో గత ఎనిమిదేళ్ల నుంచి వంట మనిషిగా పని చేస్తుంది. చపాతీల కోసం తయారు చేసే పిండిలో నీళ్లకు బదులు మూత్రం కలిపి పిండిని తయారు చేసి, ఆ పిండితో చపాతీలు చేసి వడ్డిస్తూ వచ్చింది. ఈ తంతు గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ఆ వ్యాపారవేత్త కుటుంబ సభ్యులందరూ ఒకేలా కాలేయ సమస్యలతో అనారోగ్యంపాలవుతూ వచ్చారు. దీంతో నితిన్ గుప్తా భార్య రూమ్ గుప్తాకు వంట మనిషిపై అనుమానం వచ్చింది. దీంతో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వంట గదిలో రహస్యంగా సీసీకెమెరా అమర్చారు.
 
ఆ తర్వాత ఫుటేజీని పరిశీలించగా వారి కళ్లు బైర్లు కమ్మాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలను చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. రోటీలు తయారు చేసేందుకు పిండిలో మూత్రం కలపడం చూసి షాకయ్యారు. దీంతో ఈ వీడియోను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తొలుత ఈ ఆరోపణలను నిందితురాలు రీనా ఖండించింది. వీడియో చూపించాక నేరాన్ని అంగీకరించింది. అరెస్టు చేసిన అనంతరం ఆమెను ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెల్లడించింది. చిన్నచిన్న విషయాలకు కూడా తనను తిడుతుండడంతో ప్రతీకారం తీర్చుకునేందుకే తానీపని చేసినట్టు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ హ్యాండ్ వాషింగ్ దినోత్సవం 2024: 30 మిలియన్ పిల్లలను చేరుతున్న డెట్టాల్ బనేగా స్వాస్త్ ఇండియా