తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (09:34 IST)
తెలంగాణ రాష్ట్ర రాజ్‌భవన్‌లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ చోరీ జరిగింది. సుధర్మ భవన్‌ నుంచి నాలుగు హార్డ్ డిస్క్‌లు కనిపించకుండాపోయాయి. ఈచోరీ ఈ నెల 13వ తేదీన జరిగినట్టు అధికారులు గుర్తించారు. దీనిపై రాజ్‌భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఓ టెక్కీని అరెస్టు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని అత్యున్నత అధికార కేంద్రాల్లో రాజభవన్ ఒకటి. ఇక్కడ చోరీ జరగడం కలకలం రేపింది. పంజాగుట్ట పరిధిలోని రాజభవన్ ప్రాంగణంలో ఉన్న సుధర్మ భవన్‌లో నాలుగు కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు చోరీకి గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈ నెల 13న ఈ ఘటన జరిగింది. రాజభవన్‌లోని సుధర్మ భవన్‌లో కొన్ని కంప్యూటర్ల నుంచి నాలుగు హార్డ్ డిస్క్‌లు కనిపించకుండా పోయిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అయితే, నిరంతరం డేగ కళ్లతో కూడిన పహారా ఉండే రాజభవన్ వంటి ప్రదేశంలో ఈ తరహా ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ చోరీకి పాల్పడింది రాజభవన్‌లోనే కంప్యూటర్ హార్డ‌వేర్‌ ఇంజినీర్ పనిచేస్తున్న శ్రీనివాస్ అని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. ఆ తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments