Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

Advertiesment
missing

ఠాగూర్

, సోమవారం, 19 మే 2025 (19:15 IST)
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించడం లేదు. ఫోన్లను ఇంట్లోనే వదిలివేసి వెళ్లారు. స్థానికులు, బంధువులు ఏదైనా ఊరికి వెళ్లారని భావించారు. కానీ, రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఇంటి నుంచి కనిపించకుండా పోయిన వీరబత్తిన బాలకిషన్‌కు అప్పులు ఉన్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్టు లేఖ రాసిపెట్టారని బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
బాలకిషన్ తండ్రి జనార్ధన్, భార్య వరలక్ష్మి, కుమారుడు శ్రవణ్, కుమార్తెలు కావ్య, శిరీష కనిపించడం లేదని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... అదృశ్యమైన వారి కోసం గాలిస్తున్నారు. అలాగే, వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ మధు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IRCTC: ఇండియన్ రైల్వేస్ నుంచి ఆధునిక Swarail మొబైల్ అప్లికేషన్‌