భర్తకు నత్తి అని పుట్టింటికి వెళ్లింది.. అక్కడ ప్రియుడితో జంప్ అయ్యింది.. రెండేళ్ల బిడ్డను?

సెల్వి
శనివారం, 13 సెప్టెంబరు 2025 (13:49 IST)
వివాహేతర సంబంధానికి అడ్డుగా వుందని కన్నబిడ్డనే కడతేర్చింది ఓ తల్లి. ఈ ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లికి చెందిన బొట్టు మమతకు 5ఏళ్ల క్రితం రాయపోల్‌ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌తో పెళ్లయింది. 
 
భాస్కర్, మమత దంపతులకు చరణ్, తనుశ్రీ ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు నత్తి వుందనే కారణంతో మమత పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింట్లో ఉండగా మమతకు అదేగ్రామానికి చెందిన ఫయాజ్‌తో అక్రమసంబంధం ఏర్పడింది.  ఈ ఏడాది మార్చిలో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి మమత వెళ్లిపోయింది. 
 
అయితే పెద్దల జోక్యంతో తిరిగి వచ్చిన మమత భాస్కర్‌తో కలిసి జీవించేందుకు ఒప్పుకుంది. జూన్‌ 7న మమత మరోసారి ఫయాజ్‌తో వెళ్లిపోయింది.-కొడుకు శ్రీచరణ్‌ను పుట్టింట్లో వదిలేసి కూతురు తనూశ్రీని తీసుకుని ప్రియుడితో మమత జంపయింది. అయితే పోలీసులకు మమతపై కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. 
 
విచారణలో కూతురు తనుశ్రీని తన వెంట తీసుకెళ్లిన మమత ఊరి చివర  గొంతు పిసికి, గొయ్యి తీసి పాతిపెట్టినట్లు తేలింది. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో పోలీసులు ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments