Publish Date: Sat, 13 Sep 2025 (11:36 IST)
Updated Date: Sat, 13 Sep 2025 (11:41 IST)
హైదరాబాద్లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), తెలంగాణలోని ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనితో పసుపు అలర్ట్ జారీ చేయబడిందని ఆ శాఖ తెలిపింది.
ఈ ఐదు జిల్లాలు మాత్రమే కాకుండా.. మరో 19 జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కురిసే వర్షాల వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినా, కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
దీని కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, నీటిపారుదల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున, జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు