Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత విడాకులు.. నాగార్జున కేసు.. రిప్లై ఇచ్చిన కొండా సురేఖ

సెల్వి
బుధవారం, 23 అక్టోబరు 2024 (19:37 IST)
ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున అక్కినేని వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం రిప్లై ఇచ్చారు. 
 
ఆమె తరఫు న్యాయవాది గుర్మీత్ సింగ్ ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ కోర్టు ముందు ఆమె ప్రత్యుత్తరాన్ని దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణ కోసం ఈ కేసును అక్టోబర్ 30కి కోర్టు వాయిదా వేసింది.
 
హీరోయిన్ సమంతా రూత్ ప్రభు, నాగ చైతన్య విడాకుల గురించి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఖండిస్తూ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ 10న కోర్టు మంత్రికి నోటీసు జారీ చేసింది.
 
 ఈ కేసులో ఇద్దరు సాక్షులు సుప్రియ యార్లగడ్డ, మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాలను ఇప్పటికే కోర్టు నమోదు చేసింది. ఇది అక్టోబర్ 8న నాగార్జున స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. 
 
మంత్రి వ్యాఖ్యలు తన కుటుంబ గౌరవం, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని నాగార్జున కోర్టుకు తెలిపారు. మంత్రి తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన కొడుకు విడాకుల విషయంలో అగౌరవంగా వ్యాఖ్యలు చేశారని నాగార్జున పేర్కొన్నారు.
 
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో చేసిన కృషి, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తన కుటుంబ ప్రతిష్టను దిగజార్చాయని నాగ్ అన్నారు. దీంతో కొండా సురేఖపై బీఎన్ఎస్ సెక్షన్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. 
 
అక్టోబర్ 2న నాగార్జున తనయుడు నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 విషయంలో అల్లు అర్జున్ క్లారిటీ రాబోతుంది

సంతాన ప్రాప్తిరస్తు నుంచి చాందినీ చౌదరి ఫస్ట్ లుక్

అద్భుతమైన ప్రీమియర్ టాక్ సొంతం చేసుకున్న వెనం: ది లాస్ట్ డాన్స్

లండన్‌లో జరుగుతున్న అను ఇమ్మాన్యుయేల్ మూవీ షూటింగ్

నరుడి బ్రతుకు నటన హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూవీ: శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

తర్వాతి కథనం
Show comments