11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ... రేపు నోటిఫికేషన్

వరుణ్
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (11:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం 11062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. నిజానికి బుధవారమే ఈ నోటిఫికేషన్ విడుదలకావాల్సివుంది. కానీ, డీఎస్సీ షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు మెరుగులుల దిద్దాల్సి ఉండటంతో ఒక రోజు ఆలస్యంకానుందని అధికారులు తెలిపారు. 
 
మొత్తం 11062 పోస్టుల్లో 6500 పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులే ఉన్నాయి. ఈ మెగా డీఎస్పీపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే నాలుగు లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్నారి. వీళ్ళంతా మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, డీఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసమే పకడ్బంధీగ సాఫ్ట్‌వేర్‌‍ను రూపకల్పన చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments