Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

ఠాగూర్
గురువారం, 12 జూన్ 2025 (19:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు కూడా పడ్డాయి. ఈ పిడుగుపాటు కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు పిడుగుపాటుకు గురికావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
 
పిడుగుపాటుకు చనిపోయినవారిలో పెందూర్ మాదర్రావు (45), సంజన (22), మంగం భీంబాయి (40), సిడాం రాంబాయి (45)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని వెంటనే సమీపంలోని ఝురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
అలాగే, సాంగిడి గ్రామంలో పొలం పనుల్లో ఉన్న నందిని (30), పత్తివిత్తనాలు వేస్తున్న సునీత (35)లు పిడుగుపాటుకు గురయ్యారు. ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 
అదేవిధంగా ఉట్నూర్ మండలం, కుమ్మరితాండాలోనూ పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన బోకన్ ధన్‌రాజ్ (27), నిర్మల (36), కృష్ణబాయి (30)లు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక ఆలయ గోపురం పైభాగం కూడా స్వల్పంగా ధ్వంసమైంది. అకాల వర్షాలు, పిడుగుపాట్ల ఘటనలతో జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments