Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

ఐవీఆర్
బుధవారం, 25 జూన్ 2025 (21:47 IST)
సికింద్రాబాద్: శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి ఏడాది జగన్నాథ పూరిలోని రథయాత్రతో సమానంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల కోసం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి ఈ రథయాత్రను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.
 
ఈ వైభోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ ట్రస్టీ శ్రీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.., “జగన్నాథుడి వార్షిక రథోత్సవాన్ని, సంబంధిత వేడుకలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. సికింద్రాబాద్- హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో భగవంతుని ఆశీస్సులు పొందుతారని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. ఈ రథయాత్ర నేపథ్యంలో పేర్కొన్న సమయాలను గమనించి, తదనుగుణంగా దర్శనం ప్లాన్ చేసుకోవాలని ఆయన అందరినీ అభ్యర్థించారు.
 
ఈ నేపథ్యంలో దర్శనం కోసం ఆలయ ద్వారాలు ఉదయం 6:15 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, రథయాత్ర ఊరేగింపు సాయంత్రం 4:00 గంటలకు ఆలయం నుండి ప్రారంభమై జనరల్ బజార్ నుండి కొనసాగి, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:00 వరకు ఎంజి రోడ్‌కి చేరుకుంటుంది. ఆ తర్వాత రాణిగంజ్‌లోని హిల్ స్ట్రీట్ నుండి వెళ్లి మరుసటి రోజు ఉదయం 4:00 గంటలకు ఆలయానికి తిరిగి చేరుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments