Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను రూ. 100 కోట్లు అడిగిన రేవంత్ రెడ్డి.. కౌంటరిచ్చిన కేసీఆర్

సెల్వి
గురువారం, 4 ఏప్రియల్ 2024 (13:04 IST)
సాగునీటి కొరతతో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇటీవల మండిపడ్డారు. ఈ దుస్థితిలో రైతుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
 
ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎదుట ప్రస్తావించగా.."కేసీఆర్‌ తన ఎలక్టోరల్‌ బాండ్‌ నిధుల నుంచి ఇతర కంపెనీలు, వ్యక్తుల నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయలను ఇవ్వవచ్చు. అప్పుడు ఆయన కోరిన నష్టపరిహారాన్ని సంతోషంగా పంపిణీ చేస్తాం.." అంటూ రేవంత్ చాకచక్యంగా దాటవేశారు. 
 
అయితే ఈరోజు మీడియాతో రేవంత్‌ చేసిన ప్రత్యారోపణపై కేసీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. "ప్రత్యర్థి పార్టీ నుంచి సీఎం రూ.100 కోట్లు అడగడం తమాషాగా ఉంది. చేతకాని పక్షంలో సీఎం పదవి నుంచి వైదొలగాలి. ఆ తర్వాత రైతులకు నష్టపరిహారం ఎలా ఇస్తారో చూసి సీఎం పని నేర్చుకోమన్నారు.
 
చివరకు బీఆర్‌ఎస్‌ ఎన్నికల నిధి నుంచి సీఎం రేవంత్‌ రూ. 100 కోట్లు అడగడం, దానికి ప్రతిఫలంగా కేసీఆర్‌ సీఎం పదవి ఇవ్వాలని కోరడంతో రైతు పరిహారంపై వాడివేడి చర్చ ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments