ఆస్పత్రి పడకపై ఇంకా అచేతనంగానే శ్రీతేజ్!

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (10:32 IST)
పుష్ప-2 చిత్రం బెన్ఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంకా అచేతనంగానే ఉన్నాడు. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి (32) ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఇందులో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ తొక్కిసలాట ఘటన జరిగి 56 రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తొక్కిసలాట తర్వాత బాలుడిని పక్కకు తీసుకెళ్లిన పోలీసులు సీపీఆర్ చేశారు. వెంటనే సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు. కొన్ని రోజులపాటు ఐసీయూలో వెంటిలేటరుపై చికిత్స అందించారు. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్‌ను తొలగించి ప్రత్యేక గదికి మార్చారు. అప్పటి నుంచి అతను ఆసుపత్రిలో మంచానికే పరిమితమయ్యాడు. పేరుపెట్టి పిలిచినా కళ్లు తెరిచి చూడలేడు. నోరు విప్పి మాట్లాడలేడు. ఇప్పటివరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు.
 
వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండటం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 
 
ఆ రోజు బాలుడిని జనం తొక్కుకుంటూ పోవడంతో కొంత సమయంపాటు అతని ఊపిరి ఆగిపోయింది. సీపీఆర్ తిరిగి శ్వాస అందుకున్నాడు. ప్రభుత్వం స్పందించి బాలుడికి చికిత్స అందిస్తోంది. సినిమా ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీతేజ్ మాత్రం ఎన్నడు కోలుకుంటాడో.. మళ్లీ బడికి వెళతాడో.. డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడో... అని అతని తండ్రి, చెల్లెలు కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments