Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగులను కింపచరిచిన స్మితను తొలగించాల్సిందే : హైదరాబాద్‌లో నిరసన

వరుణ్
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (08:54 IST)
దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను విధుల నుంచి తొలగించాలంటూ దివ్యాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఇదే అంశాన్ని డిమాండ్ చేస్తూ వారు హైదరాబాద్ నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిసారించి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
విద్య, ఉపాధి అవకాశాల్లో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశంపై ఐక్య వేదిక నేత నాగేశ్వర రావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments