Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమెంట్ లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. పల్టీలు కొట్టింది.. ముగ్గురు మృతి- 20మందికి గాయాలు

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (11:36 IST)
Accident
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏలూరు జిల్లాలో సిమెంట్ లారీని ట్రావెల్స్ బ‌స్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందగా.. 8 మందికి తీవ్ర గాయాలైనాయి. 
 
ఏలూరు సమీపంలో సోమవరప్పాడు - చొదిమెళ్ళ వద్ద ఆగివున్న లారీని వెంకట రమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఇంకా అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. 
 
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు నంబర్ NL 01 B 3092గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments