జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

ఠాగూర్
ఆదివారం, 19 అక్టోబరు 2025 (12:53 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఉప ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా పడుతున్నారు. ఈ క్రమంలోనే భారాస జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధన్ రెడ్డి (పీజేపీ) కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితోనూ నామినేషన్ వేయించింది. 
 
ఇప్పటికే ఆ పార్టీ తరపున మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డితోనూ భారాస నేతలు నామినేషన్లు వేయించారు. 
 
మరోవైపు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపైనర్లతో ఆ పార్టీ లిస్ట్ విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రముఖ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments