Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు..

సెల్వి
ఆదివారం, 29 డిశెంబరు 2024 (19:31 IST)
Kavitha
అక్రమ కేసులో అరెస్టయి జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం తొలిసారి నిజామాబాద్‌ పర్యటనకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను... దేనికీ భయపడను అంటూ కవిత తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం.. దమ్ములేక తపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తమని తెలిపారు. 
 
ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర, రాష్ట్ర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోంది. రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని గుర్తుచేశారు. 
 
పనిలో పనిగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. రైతులు భూములు ఇవ్వకపోయినా రేవంత్‌ రెడ్డి కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారనే విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments