Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు.. ఊడిపడుతున్న భవనం పెచ్చులు

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:34 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్తగా సచివాలయ భవనాన్ని నిర్మించింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్ రావు ఈ సచివాలయ భవనాన్ని నిర్మించారు. అయితే, ఈ భవన నిర్మాణంలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సచివాలయ భవనంలో పైపెచ్చులు ఊడిపడి ఒక  కారు ధ్వంసమైంది. 
 
సచివాలయ భవనంలోని ఆరో అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడి, పార్కింగ్‌లో ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడ్డాయి. ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. పెచ్చులు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 
 
సచివాలయంలోని ఆరో అంతస్తులోనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉండటం గమనార్హం. రూ.వందల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం నుంచి పెచ్చులు ఊడిపడటం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments