Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్

ఠాగూర్
శనివారం, 6 ఏప్రియల్ 2024 (15:03 IST)
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి మే నెల 13వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా నారాయణన్ శ్రీగణేష్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారుచేసింది. ఈయన ఇటీవలే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెల్సిందే. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ గణేష్ పేరును ఖరారు చేసినట్టు ప్రకటించారు. 
 
కాగా, శ్రీగణేష్... ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన లాస్య నందిత గెలుపొందారు. అయితే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రమాదస్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. కాగా, తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments