Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొట్టుకున్న కోడళ్లు... ఆపేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అత్త

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (12:20 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కుటుంబంలో గొడవ జరిగింది. ఇది విషాదాంతంగా ముగిసింది. ఇద్దరు కోడళ్ల మధ్య జరుగుతున్న పోట్లాటను ఆపేందుకు ప్రయత్నించిన అత్త, ఆ తోపులాటలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన బహదూరపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కిషన్ ‌బా‌గ్‌లోని అసద్ బాబానగర్‌కు చెందిన మహమూద్ (45)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇటీవల షహజాదీ బేగం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సవతులైన ఇద్దరు భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి వీరి మధ్య మరోసారి వాగ్వాదం మొదలైంది.
 
ఈ గొడవను ఆపేందుకు మహమూద్ తల్లి మహమూబ్ బీ (65) వారి మధ్యలోకి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు కోడళ్లు ఆమెను పక్కకు నెట్టివేయడంతో అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమెకు రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments