Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (10:29 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 75 శాతం హాజరువున్న డిగ్రీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయనుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో 75 శాతం హాజరుశాతం లేకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వరాదని వీసీల భేటీ నిర్ణయించారు. 
 
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ వర్శిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఇందులో డిగ్రీలో కనీసం 75 శాతం హాజరులేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ, అవి అమలు కావడం లేదని ఉపకులపతులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. 
 
దీంతో ఈ సారి మాత్రం ఆ నిబంధనలను తప్పకుండా అమలు చేయాలని వీసీలకు చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీంతో కొంతమేరకు విద్యాప్రమాణాలు పెరగడంతో పాటు విద్యార్థుల హాజరు శాతం కూడా గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. అలాగే, మూడేళ్ల డిగ్రీకి 150 క్రెడిట్లు ఉండగా, వాటిని 142కు కుదించాలని నిర్ణయించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments