Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సెల్వి
శనివారం, 5 జులై 2025 (17:57 IST)
స్నేహితులు అవమానించారనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల్ సమీపంలోని జబితాపూర్‌కు చెందిన 21 ఏళ్ల కాటిపెల్లి నిత్య తన స్నేహితులచే అవమానానికి గురైంది. నిత్య కేపీహెచ్‌బీ సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. అదే కాలనీలోని ఒక హాస్టల్‌లో ఉంటోంది. 
 
ఇటీవల, ఆమె స్నేహితులు - వైష్ణవి, సంజన, చదువులో రాణించలేదని ఆమెను ఎగతాళి చేసినట్లు తెలిసింది. ఆమె స్నేహితుల అవమానకరమైన వ్యాఖ్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె జూలై 2న ఇంటికి చేరుకున్న తర్వాత పురుగుమందు తాగింది. 
 
ఆమెను వెంటనే కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నిత్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జగిత్యాల్ రూరల్ పోలీసులు వైష్ణవి, సంజనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments