ఆమ్రపాలికి షాకిచ్చిన కేంద్రం : ఏపీకి వెళ్లాలంటూ ఆదేశం

ఠాగూర్
గురువారం, 10 అక్టోబరు 2024 (23:01 IST)
గ్రేటర్ హైదరాబాద్ మన్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి కాటాకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. తక్షణం సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. అయితే, తమను తెలంగాణాలోనే కొనసాగించాలని ఆమెతో పాటు మరికొందరు ఐఏఎస్ అధికారులు చేసుకున్న విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. 
 
తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి కీలకంగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గానేకాకుండా పలు కీలక బాధ్యతలను ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. అలాగే, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్ కూడా విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
 
అయితే, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్,, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులు ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి వీరితో పాటు మొత్తం 11 మంది అధికారులు తెలంగాణ కేడర్ కావాలంటూ కేంద్రాన్ని కోరారు. 
 
కానీ, వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అధికారులు అందరూ సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల పేరుతో లేఖను రాస్తూ వాటి కాపీలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments