Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో కూల్చివేతలు ప్రారంభం.. భారీగా పోలీసుల మొహరింపు

ఠాగూర్
ఆదివారం, 22 సెప్టెంబరు 2024 (10:44 IST)
హైదరాబాద్ నగరంలో నీటి వనరులను ఆక్రమించుకుని అక్రమంగా నిర్మించుకున్న భవనాలను హైడ్రా కూల్చివేస్తుంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఈ కూల్చివేతలు సాగుతూవచ్చాయి. అయితే, ఆదివారం కూకట్‌పల్లిలో మొదలుపెట్టారు. 27 ఎకరాల్లో విస్తరించిన కూకట్‌పల్లి చెరువు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైంది. దీంతో ఇక్కడ కూల్చివేతలను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా భారీగా పోలీసులను మొహరించారు. 
 
చెరువులోని ఎఫ్.టి.ఎల్, బఫర్‌జోన్‌లో ఏడు ఎకరాల ఆక్రమణలకు గురైనట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్‌జోన్‌లోని నాలుగు ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లను నిర్మించారు. అలాగే ఎఫ్.టి.ఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్టు గుర్తించిన అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. హైడ్రా ముందే చెప్పినట్టుగా నివాసం ఉంటున్న భవనాలను కాకుండా ఖాళీగా ఉన్న షెడ్లను కూల్చివేస్తున్నారు. నివాసం ఉంటున్న గృహాలను నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వాటిని కూల్చివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జెనీవాలో అన్నయ్య పెళ్లి.. హాజరైన సమంత.. ఫోటో వైరల్

వరద సహాయార్థం చంద్రబాబు నాయుడుకి 25 లక్షల విరాళం అందజేసిన నందమూరి మోహన్ రూప

హీరో సాయి దుర్గ తేజ్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్ నిర్మాణం

విక్టరీ వెంకటేష్ చిత్రం సెట్స్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ

నమ్రత ఘట్టమనేని క్లాప్ తో అశోక్ గల్లా హీరోగా చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి, బాగా నిద్రపోవడానికి చిట్కాలు

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments