హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (08:56 IST)
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ చార్జీలు పెరగనున్నాయి. కొత్తగా పెంచిన ధరలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రతి రోజూ మెట్రో రైళ్లలో లక్షలాది మంది నగర వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి మెట్రో రైళ్లలో చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సవరించిన నూతన చార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
ప్రస్తుతం కనీస చార్జీ రూ.10గా ఉంటే దాన్ని రూ.12కు పెంచారు. అదేవిధంగా గరిష్ట ప్రయాణ చార్జీ రూ.60 నుంచి రూ.75కి పెంచారు. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా చార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు పెరిగన చార్జీలు ఇలా ఉన్నాయి. 
 
తొలి రెండు స్టేషన్ల వరకు ప్రయాణ కనీస చార్జీ రూ.12గా నిర్ణయించగా, 2 నుంచి 4 స్టేషన్ల మధ్య ప్రయాణిస్తే రూ.18, 6 నుంచి 9 స్టేషన్ల వరకు ప్రయాణిస్తే రూ.30, 9 నుంచి 12 స్టేషన్ల వరకు ప్రయాణిస్తే రూ.50, 12 నుంచి 15 స్టేషన్ల వరకు రూ.55, 15 నుంచి 18 స్టేషన్ల వరకు రూ.60, 18 నుంచి 21 స్టేషన్ల వరకు రూ.66, 21 నుంచి 24 స్టేషన్ల వరకు రూ.70, 24 స్టేషన్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టయితే రూ.75గా నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments